హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని తాజ్ ఫలక్ నుమాలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ డీవై. చంద్రచూడ్ ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీజేఐకి పుష్ఫగుచ్చం ఇచ్చి.. వీణను బహుకరించారు. కాగా..సీఎం రేవంత్ను ఆయన నివాసంలో ఫ్రాన్స్ రాయబారి థియరీ మాథౌ, ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్టీ ప్రశాంత్ మెహతా బృందం వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిశారు.